Tuesday, September 15, 2015

విశ్వకర్మ జయంతి సందర్భంగా

విశ్వకర్మ జయంతి సందర్భంగా 

ప్రపంచం నిర్మాణ రంగంలో ఈరోజు అద్భుతాలను సృష్టిస్తున్నది. భారతీయులు కుడా ప్రపంచంలో ఉన్న కట్టడాలను, ఎత్తైన్న కట్టడాలను, భవనాలను చూసి  ఆయా దేశాలను అభివృద్ధి చెందినవిగా, మన దేసమేదో వెనుకబడిన దేశంగా భావిస్తూ భ్రమిస్తూ, మన అస్తిత్వాన్ని మరచిపొయరెమో అని అనిపిస్తూ ఉంటున్ది.. ఎందుకంటే మన పిల్లలకు ఈ దేశపు చరిత్రను గాని, మన ఘన సంస్కృతిని గాని  పరిచయం చెయ్యడం  లేదని చెప్పక తప్పదు . 

విశ్వకర్మ ద్వారా  సమాజంలో పంచ బ్రాహ్మలు సృష్టించ బడ్డారు. వారు
01. శిల్పి (రాతిని వినియోగించేవారు)
02. కమ్మరి (ఇనుప పని చేసే వారు )
03. కుమ్మరి (మట్టి పని చేసె వారు )
04. కంసాలి  (కర్ర తో పని చేసే వారు )
05. తగరాలు లేదా షరాబులు (బంగారము మరియు ఇతర లోహాలతో పని చేసే వారు )
ఎన్నో సంవత్సరాల నుండి విశ్వకర్మ వారసులైన ఈ వృత్తుల వారు చేసిన అద్భుతాలు ఈనాటికి చెక్కు చెదరకుండా మనకి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మిగిలి ఉన్నాయి.

ఈ రోజు పై వృత్తుల వారు ఎందుకు పనికిరాని వారు గా, ఏమి చేతకానివారిగా సమాజం చేత పరిగానిమ్పబడుతున్నారు . అందుకే ప్రతి ఒక్కరు తమ కుల వృత్తిని విస్వరించి తమ పిల్లలను డాక్టర్నో  ఇంజనీర్ నో   చెయ్యాలని అప్పులు చేసి,  ఎందుకు పనికిరానివారి గా, తయారు చేస్తున్నారు. (సంవత్సరానికి లక్షలలో ఇంజనీరులు, డక్టరులు తయారవుతున్నారు, వారి యొక్క నైపుణ్యం మనము చేస్తున్నాము ) .    కాని సదరు బ్రాహ్మలు సృష్టించిన అద్భుతాలు నేటి ఇంజనీర్లకు  లెదు. మనకే కాదు ప్రపంచానికే అంటూ చిక్కటం లేదు.

01.  శిల్పి    :    :    ప్రపంచాన్నే ఆశ్చర్య పరచినది మన శిల్ప శాస్త్రం. దాని వెనుకాల ఉన్న సాంకేతిక పరిగ్యానం అంతుచిక్కక ఆలోచనలో పడేసిన్ది.  1000 సంవత్సరాలు మన సంపదను చిద్రం చేసిన, మట్టి పాలు చేయాలని ప్రయత్నం చేసినా, మిగిలిన సంపదను చూసి ముక్కున వేలేసు కుంటున్నారు. ఉదాహరణ గా అజంతా మరియు ఎల్లోరా గుహలు. అందులో నిర్మించిన  కైలాస  మందిరం. (ఏక శీల లో మలచినది)    https://www.youtube.com/watch?v=B2Jl4HNDixc




బృహదీశ్వర ఆలయం లో గోపురం నీడ సంవత్సరంలో ఏ నాడు భూమిని తాకదు. యెలా. ?  అలంటి గొప్ప శిల్ప శైలి మనది. మన పుర్వజులు చేసిన అద్భుతాలు. ఈ నాటి ఇంజనీరింగ్ అందులో ఎంత శాతం ? అనే భావన కలుగక మానదు. అలాంటిదే తంజావూర్ లోని బృహదీశ్వర ఆలయం . ఇలా  ఈ దేశంలో ఎన్నో ఎన్నెన్నో.  

216 అడుగుల ఎత్తైన గోపురం నీడ భూమిపై పడక పోవడం, ఆ నాటి నిర్మాణ కౌశలానికి నిదర్శనమ్.  ప్రస్తుతం నిన్న కట్టిన వంతెన కు లేదా నిర్మాణానికి ఎప్పుడు పడిపోతుందో చెప్పలేని పరిస్తితి.  అత్యాధునిక శంకేతికత తో కూడుకున్న  సిమెంట్ లేకపోయినా మట్టి తో కట్టిన కట్టడాలు నేటికి కనీసం బీటలు వారలెదు. అది మన పూర్వుల నిర్మాణ కౌశలం. అందుకు ఉదాహరణలు చలా మన కళ్ళముందే కనిపిస్తాయి. వందల సంవత్సరాల పూర్వం కట్టిన ఎన్నో కోటలు మన ముందు సజీవ సాక్షాలుగా  ఉన్నాయి.. అంట గొప్పది మన శిల్ప శాస్త్ర పరిజ్ఞానం. ఇది పరంపరాగతంగా మనకు లభించిన వారసత్వ సమ్పద. అలంటి సంపదను చేతకానిడిగా, పనికిరానిదిగా చిత్రీకరిస్తున్న మన విద్య విధానం, దానికి కాషాయం రంగు పులిమి ఉగ్రవాద బుచిలా చూపిస్తున్న దేశ చరిత్ర తెలియని పాలకులు మనకు దాపురించిన దురద్రుస్టమ్.  














కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఇంత  అద్భుత చరిత్ర కలిగిన, నిర్మాణ కౌశలం ఉన్న దేశం మన దేశం. మన పుర్వజుల  శక్తి సామర్ధ్యాలు అనన్తమ్. వీరు విశ్వకర్మ వారసులు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్ధులు. వారి వారసులుగా మనం గర్వించాలి. 

No comments:

Post a Comment