Friday, February 1, 2013

భవన నిర్మాణ కార్మిక మిత్రులతో :

నేను పని చేస్తున్నది నా వృత్తి రీత్యా ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ను కావడం వలన నా పని పూర్తిగా భవన నిర్మాణ కార్మికులతోనే. నేను పని చేస్తున్న రంగం నుండే నా పని ఆరంభిచాలని నాకు ఆశ కలిగింది. అదే ఆధారం కూడా . అందుకే కొంతమంది మిత్రులను, తపన కలిగిన వారిని కలిసాను అనేకన్నా భగవంతుని దయవలన  యాదృచ్చికంగా వారిని కలిసే అవకాసం లభించింది అనే అనాలి. దేశంలో నిజాయితీకి  కరువవలేదు అనేది సత్యం. సామాన్య మానవుడు ప్రతి వాడు అని అనలేను కాని 99 శాతం మంది మాత్రం ఇంకా నిజాయితిగా బ్రతకాలనే కోరుకుంటున్నారు. అందులో అతి క్రింద స్తాయి నుండి  వచ్చిన  లేదా తన జీవితాన్ని ఆరంభించిన కోసర సోమేశ్వర రావు (సోంబాబు)  ఒకరు. సగానికి పైగా తన  జీవితాని తన తోటి కార్మిక మిత్రుల కొరకు, వారి జీవితాలలో వెలుగును  నింపేందుకు కష్టించి పనిచేసిన వ్యక్తీ. వారిలో ఐక్యత ను  సాధించేందుకు, వారందరినీ ఏక  త్రాటిపై  నడిపించేందుకు కృషి చేసిన వ్యక్తీ. అలాంటివారు ఎందరో ఉన్నారు. వారితో  కలసి పనిచేసే అవకాసం నాకు లభించడం నా  అదృష్టమే
ఆదర్శం కొరకు పుస్తకాలు చదివి, తిరగాల్సిన అవసరం లేదు. మన  ఎదురుగానే ఉంటుంది. కాని మనమే  దానిని గమనించకుండా ప్రక్కకి తప్పుకున్టాము

నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, సేవా భావం, ఇవన్ని ముర్తిభావించిన  వ్యక్తీ సోంబాబు

40 సంవత్సరాల  నైపుణ్యతలో, కాలంలో సదరు వ్యక్తీ సంపాదించినది శూన్యం. 60 సంవత్సరాలు  పైబడినా ఇంకా  నా అన్నవారికి ఏదో  చెయ్యాలనే తపన, ఆశ,  పట్టుదల, అలసిపోని  చిరునవ్వు.  ఎదుటివారిని
దోచేసుకోవాలనే కోరిక గాని, ఎవడెలా పొతే నాకేంటి  అనే భావన కాని  లేని సోంబాబు వంటి వ్యక్తులు  కోకొల్లలుగా ఉన్న మాట వాస్తవం.  కాని సాటి  వ్యక్తీ ద్రుష్టి నిత్యం ధనార్జన పైన, తన అవసరాలు కొరకు కష్టపడడం పైన, సంపన్నులపైన ఉంటుంది. ఆ దిశగానే ప్రయాణం మరియు ప్రయత్నం ఉన్న మాట నిజం కుడా

నా అదృష్టం, వారితో పనిచేసే అవకాసం నాకు లభించింది.

వారితో పనిచేసి చాలా విషయాలు నేర్చుకున్నాను, నేర్చుకుంటున్నాను. మనమంతా నిత్య విద్యర్డులం కదా ... 

చోడవరం మండలం గందిగ్రామం పంచాయితీ నుండి ఆరంభించిన కార్యక్రమము ఈ నాటికి ఏడు  (చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట, మాడుగుల, కె.కోటపాడు, దేవరాపల్లి) మండలాల వరకు విస్తరించింది. సుమారు 48 భావన నిర్మాణ కార్మిక సంఘాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది.   

ప్రస్తుతం  డివిజన్ స్తాయి భావన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటుకు సన్నాహాలను చెయ్యడం జరుగుతోంది

వీరందరినీ అవినీతి వ్యతిరేక ఉదయంలో భాగస్వాములను చెయ్యాలి. ప్రతి ఒక్కరు అవినీతికి పనిచెయ్యాలి అనేది నా కోరిక

దైవం ఎంతవరకు సహకరిస్తాడో వేచి చూడాలి.  ఎందుకంటే 

"దేశంలో ఎంతో మంది ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్నారు. కాని దేశంలో ఉన్న 120 కోట్ల ప్రజలు ఒక రోగంతో బాధపడుతున్నారు. (ఆఖరికి పుట్టబోయే బిడ్డ నించి, చనిపోయి శవమై కాలి బూడిదవడానికి సిద్ధంగా ఉన్న వారి వరకు)    ఆ రోగం పేరు అవినీతి".     

అమ్మ ఇబ్బందులు పడుతోంది. అమ్మ కొరకు పనిచేసేటట్లుగా చెయ్యడమే మన అందరి పని కావాలి.  పని చేద్దామా............



No comments:

Post a Comment